Tuesday, May 22, 2007

నాది జ్ఞానమే

మన ప్రధానమంత్రి ఎవరో వెంటనే గుర్తుకు రాకపోవడం గురించి నాది జ్ఞానమా? అజ్ఞానమా? అన్న టపా వ్రాసాను. యూపియే ప్రభుత్వం మూడేళ్ళ పాలన ముగిసిన సందర్భంగా నీరజా చౌదరి వ్రాసిన వ్యాసం ఈనాడులో చదివాక నాది జ్ఞానమేనని తేలింది. అందులో ఒకచోట
"....మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ వర్గాలు ఏకంగా ఆయన హోదానే మార్చేశాయి. 'ఆయన ఓ మంచి మనిషి. కానీ ఉన్నతుడైన కేబినెట్‌ కార్యదర్శిగా మిగిలిపోతున్నారు' అని అవి అభివర్ణిస్తున్నాయి" అని వ్రాసారు.


ఈభావాన్నే నాబ్లాగులో (వ్యాఖ్యలో) "అసలు సమస్య, ఘనమైన దేశానికి ప్రధాన మంత్రి ఒక ఆఫీసర్ మాదిరి పనిచేయడం. అలవాటు పడిన ప్రాణం మరి. బహుశ: జ్యోతి వానికి కూడా సందేహమొచ్చుంటుంది- అందుకే 'భారత' అని గాని, 'మన' అని గాని ప్రధాన మంత్రి అన్న పదం ముందు తగిలించలేదు." అని వ్రాసా.

ఏతావాతా తేలిందేమిటంటే, పెద్దాయనకి కూడా డౌటేనని (డౌటులేదని). కావాలంటే అదే వ్యాసంలోని ఈ క్రింది వాక్యాలు చూడండి.
"మరోవైపు మన్మోహన్‌.... 'కోటరీ ఆధిపత్యం'పై విమర్శలు చేస్తున్నారు. ఇది ఒకరకమైన నిరాశా నిస్పృహల నుంచి వచ్చిన వ్యక్తీకరణ. 'అధికారం నావద్ద కాదు, ఇతరులు... అంటే మిత్రపక్షాలు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలి వద్ద ఉంది' అనే ఒప్పుకోలు ప్రకటన...."

No comments:

Post a Comment

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.